నాదస్వరం వినిపిస్తే పుట్టలోని పాములన్నీ బయటికి వచ్చినట్లుగా, మీరు నామస్మరణ చేస్తే మీ హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి. నామస్మరణ చాలా పవిత్రమైనది. ఈనాడు నామస్మరణ తగ్గిపోవడం చేతనే దేశంలో బాధలు పెరిగిపోతున్నాయి. వీధివీధి యందు నామ సంకీర్తన చేయండి. శరీరంలోని అణువణువునూ, కణకణమునూ భగవన్నామంతో నింపుకోండి. నామస్మరణ వలన కలిగే ఆనందము, ధైర్యసాహసాలు ఇంక దేనివల్లనూ లభించవు. ఇతరులేమనుకున్నా ఫరవాలేదు, అపహాస్యం చేసినా పట్టించుకోనక్కర్లేదు. దృఢమైన విశ్వాసంతో నామస్మరణ చేసినప్పుడు మీరు అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. మీ మనస్సే ఒక వీణ. అందులో చెడ్డభావాలనే ‘అపస్వరాలు' రాకుండా చూసుకోండి. మనస్సనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ మీ జీవితాన్ని గడపండి. అప్పుడే మీకు భగవదనుగ్రహప్రాప్తి కలుగుతుంది.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Thursday, January 4, 2024
Subscribe to:
Post Comments (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.
No comments:
Post a Comment