భగవంతుని శరణాగతి పొందినవాడు సదా నిశ్చింతగా ఉంటాడు. ఎందుకంటే మనసు, బుద్ధి అన్నీ ఆయనకే ఆర్పిస్తాడు. నిర్భయంగా ఉంటాడు. మృత్యువుకు భయపడడు. భగవంతుని చరణాలు వీడడు. అతనికి శోకమనేది తెలియదు. జరిపించేది భగవంతుడు కనుక ఫలితం నాది కాదు భగవంతునిదే అని భావించడం వల్ల శోకమనేది దరి చేరదు. భగవంతుని శరణు వేడడం వల్ల్ల మనలో గూడు కట్టుకుని ఉన్న సంశయాలన్ని పటాపంచలవుతాయి. ముక్తి అనే ఒకటే భావన మిగిలిపోతుంది. సందేహాలు దూరమవుతాయి. శరణాగతుడైన భక్తుడు ఎప్పుడూ పరీక్షలకు గురవడు. భగవంతునికితనను తాను దత్తం చేసు కున్న తరువాత భక్తుణ్ని పరీక్షించేందుకు వారి వద్ద తమకంటూ ఏమీ ఉండదు. కనుక ముముక్షువు అయినవాడు శరణాగతి భక్తినే ఆశ్రయిస్తాడు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Wednesday, June 28, 2023
Subscribe to:
Post Comments (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.
No comments:
Post a Comment