జీవునిలో దేవుడు కొలువై ఉండాలంటే...
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ శరణాగతి చేయాలి ...
ఈశ్వర తత్వం చింతించాలి మదిలో హృది లో పరమేశ్వరుడిని నిలపాలి...
పాహిమాం ప్రభో రక్ష మాం అంటూ ఆత్మ నివేదన చేయాలి అనుగ్రహించమని కైలాస నాథుని వేసుకోవాలి...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment