సిత్రాలు సేసేడు నిత్యగంగాధరుడు
పంచభూతాలలో ఎప్పుడూ సేదతీరుతూనే ఉంటాడు...
ఉన్నోడయినా లేనోడయినా చివరకు చేరేది ఆయన పాదాల చెంతకే...
అందుకే ఉన్నన్నాళ్ళు పంచాక్షరీ మంత్రంతో ఓం నమః శివాయ అని జపించండి అవ్యయ మోక్షము పొందండి...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment