Friday, August 28, 2020

హరే

ధర్మబద్ధమైన కోరిక అశాంతిని కలిగించదు.కోపాన్ని పుట్టించదు.మనసును శుద్ధి చేసుకోవాలంటే మొదటగా భగవంతుడు ప్రసాదించిన దానిని స్వీకరించాలనే భావం మనిషిలో కలగాలి.ఈ భావం వలన కోరిక అనేది నశించిపోతుంది. అపారమైన ప్రేమను భగవత్పరంగాను, భగవంతుని ప్రతిరూపమైన తోటి జీవుల పరంగాను పెంపొందించుకుంటే కోపం అనే మలినం తొలగిపోతుంది. త్యాగగుణాన్ని అలవరచుకుంటే లోభగుణానికి చోటుండదు. భగవంతుని పట్ల ప్రేమ, భక్తిని పెంచుకొనుటచేత మోహం కూడా దూరమైపోతుంది.ఈ ప్రపంచ సౌఖ్యాలన్నీ అనిత్యమనే వివేకం చేత మదము, మత్సరము రెండు మలినాలు కడుక్కుపోతాయి.

ఈ విధంగామనసుపై నుండు మలినములను శుద్ధి చేసుకోకుండా బాహ్య శుద్ధి ఎంత చేసినా భగవత్ప్రేమకు నోచుకోలేరు.

సర్వే జనా సుఖినో భవంతు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u తెలిసి తెలియక నే చేసిన పాపమెంతో తెలివి రాక నే చేసిన దోష మెంతో మోయ లేనిక పాపాల భారమంతా ...