అంతరాత్మ ఎల్లప్పుడూ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది...
దాని నుండి తొలగిపోయి ఈ ఐహికమైన మాంసం, ఎముకలతో కూడిన పంజరం వైపు తమ దృష్టిని మరల్చి, మానవులు 'నేను', 'నేను', 'నేను' అని అంటున్నారు...
బలహీనత లన్నింటికి ఇదే మూలం...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...