ఆది-మధ్య-అంతములు లేనిది, శాశ్వతమైంది, అఖండమైంది, అనాదిగా ఉన్నది చీకటే. వెలుగు సృష్టితమైందే. సృష్టితమైంది శాశ్వతం కాదు. పోతన చెప్పినట్లుగా 'లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది' అలోకమైంది పెంజీకటి. పెంజీకటే సర్వవ్యాపితం. అదే శివస్వరూపం. 'లోకంబులు' అంటే సృష్టి, 'లోకేశులు' అంటే స్థితి, లోకస్థులు లయ. ఈ మూడింటికీ ఆధారమైన త్రిభువనుడూ శంకరుడే. ఈ పెంజీకటి కవతల జ్ఞాన రూపంలో వెలిగే ఈశానుడూ శంకరుడే.
No comments:
Post a Comment